ChotaNews Quick Feeds

చంద్రబాబుతో కేంద్రమంత్రి భేటీ

చంద్రబాబుతో కేంద్రమంత్రి భేటీ

AP: ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

నెట్ లేకుండానే ఫైల్ షేరింగ్!

నెట్ లేకుండానే ఫైల్ షేరింగ్!

వినియోగదారుల సౌకర్యం కోసం మేసేజింగ్ యాప్ వాట్సప్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. నెట్‌ అవసరం లేకుండానే ఫైల్‌ షేరింగ్‌ సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తోంది. ఇన్-యాప్ డయలర్‌తో సహా కొత్త ఫీచర్లను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫీచర్లు ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్నాయి. ఎంపిక చేసిన బీటా టెస్టర్‌లకు ఇప్పటికే దీన్ని అందుబాటులో ఉంచారు.

AP పేపర్‌ మిల్లు ఆకస్మిక లాకౌట్‌

AP పేపర్‌ మిల్లు ఆకస్మిక లాకౌట్‌

AP : ఆంధ్రా పేపర్ లిమిటెడ్(APL) యాజమాన్యం ఏప్రిల్ 2 నుండి కొనసాగుతున్న సమ్మె ప్రభావాన్ని చూపుతూ.. ఏప్రిల్ 24 (బుధవారం) తన రాజమహేంద్రవరం యూనిట్‌కు ‘లాకౌట్’ ప్రకటించింది. అర్థంతరంగా పేపర్ మిల్‌కు లాకౌట్ ప్రకటించడంపై కార్మికులు, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు 800మంది పర్మినెంట్ కార్మికులు, 1,200 మంది తాత్కాలిక కార్మికులు, 800మంది దినసరి కూలీలు లాకౌట్ వల్ల ప్రభావితమవుతారు.