ChotaNews Quick Feeds

వైసీపీ నేతకు కరణం వెంకటేష్ పరామర్శ

వైసీపీ నేతకు కరణం వెంకటేష్ పరామర్శ

బాపట్ల: చీరాల మండలం ఈపురుపాలెంలోని వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ తిరువీధుల ధనుంజయను ఆయన నివాసంలో ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. వెంకటేష్ వెంట మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ న‌యా ప్లాన్‌

ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ న‌యా ప్లాన్‌

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి మోదీ నేతృత్వంలో అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది. తాజాగా మహారాష్ట్ర బీజేపీ యూనిట్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ‘కాఫీ విత్ యూత్’ పేరుతో ప్రచారం ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో కూడిని కాఫీ మగ్‌లను ప్రచారంలో ఉపయోగించనున్నారు. మహారాష్ట్ర బీజేపీ ముఖ్యంగా యువతతో ఇంటరాక్ట్ కావడానికి ఈ ప్రచారాన్ని ప్రారంభించింది.

ఐపీఎల్‌లో విరాట్ మరో రికార్డు

ఐపీఎల్‌లో విరాట్ మరో రికార్డు

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మ‌రో మైలురాయిని చేరుకున్నాడు. ఆర్సీబీ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో క్రిస్ గేల్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈరోజు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న‌ మ్యాచ్‌లో తన 240వ సిక్స్‌ను కొట్టి కొత్త రికార్డును సెట్ చేశాడు కోహ్లీ. కాగా రెండు, మూడు స్థానాల్లో వరుసగా గేల్(239), డివిలియర్స్(238) ఉన్నారు.