కన్నుల పండుగగా శ్రీశైల గిరి ప్రదక్షిణ
కర్నూలు: శ్రీశైలంలో చైత్రశుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని దేవస్థానం సాంప్రదాయపద్ధంగా శ్రీశైల గిరిప్రదక్షిణను నిర్వహించింది. స్వామి అమ్మవార్ల మహామంగళహారతి అనంతరం ఉత్సవమూర్తులను ధర్మప్రచార రథంలో ఆసీనులను చేసి విశేషపూజలు చేశారు. అనంతరం ధర్మప్రచార రథంలో శ్రీగిరి ప్రదక్షిణ చేపట్టారు. ప్రధాన ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం నుంచి ప్రారంభమై గంగాధర మండపం వద్దకు చేరుకోవడంతో గిరిప్రదక్షిణ ముగిసింది.