బీసీవై అభ్యర్థి భూలక్ష్మి నామినేషన్
ఎన్టీఆర్: రాష్ట రాజకీయాల్లో మైలవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు మైలవరం సీటును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అలాంటి తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా బీసీవై పార్టీ తరఫున కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్, బీసీ సామాజిక వర్గానికి చెందిన ముప్పసాని భూలక్ష్మి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.