ChotaNews Quick Feeds

ఓటర్లకు ర్యాపిడో గుడ్ న్యూస్

ఓటర్లకు ర్యాపిడో గుడ్ న్యూస్

దేశంలో శుక్రవారం రోజున రెండోవిడత పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలోనే రైడ్‌షేరింగ్‌ ‘ర్యాపిడో’ ఓటర్ల కోసం ఓ ఆఫర్‌ తీసుకొచ్చింది. పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఉచితంగా బైక్‌ రైడ్‌ సదుపాయాన్ని కల్పిస్తామని ప్రకటించింది. తమ సేవలను కేవలం కర్ణాటకలో మాత్రమే అందించేందుకు ర్యాపిడో సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఓటింగ్ శాతాన్ని పెంచడంలో భాగంగా తమవంతు కృషి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ర్యాపిడో వెల్లడించింది.

ORRపై దగ్ధమైన కారు.. ఒకరి మృతి!

ORRపై దగ్ధమైన కారు.. ఒకరి మృతి!

TG: హైదరాబాద్ ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై కారు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న ఓ వ్యక్తి సజీవదహనం అయినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.