ఎంపీ వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
ఈ ఎన్నికల్లో బీజేపీ టికెటు దక్కని వరుణ్ గాంధీ ఫీలీభీత్ నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. ‘1983లో మూడేళ్ల వయసులో మా అమ్మ వేలు పట్టుకొని ఈ ప్రాంతంలో అడుగుపెట్టా. ఈ ప్రజలంతా నా కుటుంబమే. ఎంపీగా నాపదవీకాలం ముగిసినా.. మీతో నాబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. మీకోసం మాఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’’ అని వరుణ్ లేఖలో పేర్కొన్నారు.