ChotaNews Quick Feeds

బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్‌: ర‌ఘునంద‌న్ రావు

బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్‌: ర‌ఘునంద‌న్ రావు

బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్ అని మెద‌క్ బీజేపీ పార్ల‌మెంట్ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ రావు అన్నారు. రంజిత్ రెడ్డి నుంచి కడియం కావ్య వరకు వెళ్లిపోతున్నారు. అధికారంలో ఉండగా అనేక అక్రమాలు చేశారు. ప్ర‌జల రక్తాన్ని పీల్చి పిప్పిచేసినోళ్లు సేవ చేస్తామని వస్తున్నారని విమ‌ర్శించారు. హ‌రీశ్ రావు ఫోన్ ట్యాపింగ్‌లో మొద‌ట జైలుకు వెళ్తాడ‌న్నారు. 17ఎంపీ స్థానాలు గెలిచి మోదీకి కానుక‌గా ఇస్తామ‌న్నారు.

ప్రజా ఆశీర్వాద యాత్ర

ప్రజా ఆశీర్వాద యాత్ర

వికారాబాద్: బీజేపీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్ర పూడూరు మండలం మంచన్‌పల్లిలోజరిగింది. కార్యక్రమంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పరిగి అసెంబ్లీ ఇన్‌చార్జి మారుతి కిరణ్ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్‌ను క‌లిసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

సీఎం రేవంత్‌ను క‌లిసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని నర్సాపూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు.