బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్: రఘునందన్ రావు
బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్ అని మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. రంజిత్ రెడ్డి నుంచి కడియం కావ్య వరకు వెళ్లిపోతున్నారు. అధికారంలో ఉండగా అనేక అక్రమాలు చేశారు. ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పిచేసినోళ్లు సేవ చేస్తామని వస్తున్నారని విమర్శించారు. హరీశ్ రావు ఫోన్ ట్యాపింగ్లో మొదట జైలుకు వెళ్తాడన్నారు. 17ఎంపీ స్థానాలు గెలిచి మోదీకి కానుకగా ఇస్తామన్నారు.