నామినేషన్ వేసిన పేర్ని కిట్టు
కృష్ణా: మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) నామినేషన్ దాఖలు చేశారు. తన తల్లి జయసుధతో కలిసి పేర్ని కిట్టు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి ఎం.వాణికి అందజేశారు. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడైన కిట్టు.. పిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి మచిలీపట్నం అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.