ChotaNews Quick Feeds

నామినేషన్ వేసిన పేర్ని కిట్టు

నామినేషన్ వేసిన పేర్ని కిట్టు

కృష్ణా: మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) నామినేషన్ దాఖలు చేశారు. తన తల్లి జయసుధతో కలిసి పేర్ని కిట్టు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి ఎం.వాణికి అందజేశారు. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడైన కిట్టు.. పిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి మచిలీపట్నం అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్‌పై జగ్గారెడ్డి ఫైర్

బీజేపీ, బీఆర్ఎస్‌పై జగ్గారెడ్డి ఫైర్

TG: బీజేపీ, బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి అన్నీ చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ, బీఆర్ఎస్‌ నేతలు నిందిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారు కాబట్టే.. కేసీఆర్ సీఎం అయ్యారని, సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు.

మెదక్‌ పార్లమెంటుకు కేంద్రం ఇచ్చిన నిధులపై బుక్

మెదక్‌ పార్లమెంటుకు కేంద్రం ఇచ్చిన నిధులపై బుక్

మెదక్‌ పార్లమెంటుకు కేంద్రం ఇచ్చిన నిధులపై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు బుక్ విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘కేంద్ర నిధులపై సీఎం, సీఎస్‌కు పోస్టులో పుస్తకం పంపుతాం. 2 పడకల ఇళ్లు, రోడ్లు, ఉపాధి నిధులపై వివరాలున్నాయి. కొడంగల్‌లో ప్రతి పంచాయతీ వివరాలు కూడా పంపుతాం. దుబ్బాక స్థానంలోనే ఉపాధి కూలీలకు రూ.230కోట్లు ఇచ్చాం’’ అని అన్నారు.