ChotaNews Quick Feeds

21న గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష

21న గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష

TG: రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో (ఇంగ్లీషు మీడియం-ఎంపీసీ, బీపీసీ, ఏఈసీ) ప్రవేశాలకు ఈనెల 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ తెలిపారు. సంబంధిత పరీక్ష కేంద్రాలకు 30 నిమిషాల ముందే చేరుకోవాలని సూచించారు.

ఇరాక్‌లో బాంబు దాడి.. ఒకరి మృతి

ఇరాక్‌లో బాంబు దాడి.. ఒకరి మృతి

సెంట్రల్ ఇరాక్‌లోని సైనిక స్థావరంపై శుక్రవారం రాత్రి బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయని ఇరాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

AP: అన్నమయ్య జిల్లాలోని చిలుకూరుపేటలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను నాగరాణి (30), 10 ఏళ్లలోపు పిల్లలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.