రుణమాఫీ విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి
TG: అధికారంలో ఉన్నపుడు ఏనాడూ పంట పొలాలు సందర్శించని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ఆర్బీఐ, బ్యాంకులతో కలిసి విధి విధానాల రూపకల్పన చేస్తున్నాం అని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.