వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
AP: గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశించింది. ములుకుదురులో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మురళీ పంపిణీ చేయడంపై తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వంశీకృష్ణ.. సీఈవో ముకేశ్కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు కోడ్ ఉల్లంఘించినట్టు నిర్ధారణ కావడంతో అంబటి మురళీపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ను ఈసీ ఆదేశించింది.